HomeTelugu Trendingసరోగసిపై రష్మీ గౌతమ్‌ వ్యాఖ్యలు..

సరోగసిపై రష్మీ గౌతమ్‌ వ్యాఖ్యలు..

6 17
హాట్‌ యాంకర్ రష్మీ గౌతమ్‌కు మంచి ఫాలోయింగ్ ఉంది. యాంకరింగ్‌తో పాటు అవకాశం వచ్చినప్పుడల్లా సినిమాలు నటిస్తూ.. తన అందచందాలతో తెలుగు రాష్ట్రాల్లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. అంతేకాదు ఆ మధ్య రష్మీ హీరోయిన్‌గా నటించిన ‘గుంటూరు టాకీస్’ తన నటనతో కుర్రకారుని కట్టిపడేసింది. అంతే కాకుండా సామాజిక అంశాలపై స్పందిస్తుంది. తాజాగా సరోగసి విధానంపై రష్మీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. అద్దె గర్భం ద్వారా పిల్లలను పొందే బదులు అనాథలను దత్తత తీసుకుంటే మంచిందని ఆమె అభిప్రాయపడింది. అంతే కాకుండా “సొంత రక్తం అయితేనే ప్రేమిస్తారా? ఈ ధోరణి వివక్ష చూపడమేనని ఇదంతా కులాభిమానం మతాభిమానం వంటిదేనని.. పిల్లల విషయంలో జీన్స్ కొంతవరకే వర్క్ అవుట్ అవుతుందని.. మిగతా తల్లిదండ్రుల పెంపకంపై ఆధారపడి ఉంటుంది” వ్యాఖ్యానించింది. దాంతో రష్మీ వ్యాఖ్యలపై కొంతమంది మండిపడుతున్నారు. మరి కొందరు సపోర్ట్ చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu