HomeTelugu Trendingముంబైలో ఖరీదైన ప్లాట్‌ కొన్న రష్మిక!

ముంబైలో ఖరీదైన ప్లాట్‌ కొన్న రష్మిక!

Rashmika mandanna buys new
రష్మిక మంద‌న్నా తాజాగా బాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వనుంది. న‌టుడు సిద్దార్థ్ మ‌ల్హోత్రాతో క‌లిసి మిష‌న్ మ‌జ్ను సినిమాలో నటిస్తుంది. హిందీ చిత్ర‌ప‌రిశ్ర‌మ‌పై ఫోక‌స్ పెట్టాల‌నుకుంటున్న ర‌ష్మిక‌.. దీని కోసం స్పెష‌ల్‌గా ట్యూట‌ర్ ను కూడా పెట్టుకోవాల‌నుకుంది. ఈ భామ ముంబైలో ఖ‌రీదైన ప్లాట్‌ను కొనుగోలు చేసిన‌ట్టు బాలీవుడ్‌లో ఓవార్త హాట్ టాపిక్‌గా మారింది. ఇంత‌కుముందు ర‌ష్మిక ముంబై వెళ్లిన‌ప్పుడు హోట‌ల్స్ లో బ‌స చేసేది. ఇపుడు సొంత‌ ఇల్లు చూసుకోవ‌డంతో సంతోషంలో మునిగితేలుతుంది. ఇదిలా ఉంటే ర‌ష్మిక ఇప్ప‌టికే హైద‌రాబాద్ లో విలాస‌వంత‌మైన ఇంటిని కొనుగోలు చేసిన‌ట్టు వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. మిష‌న్ మ‌జ్ను చిత్రం త‌ర్వాత డెడ్లీ ప్రాజెక్టు చేయ‌నుంది ర‌ష్మిక‌. ఈ చిత్రంలో బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ అమితాబ్‌బచ్చ‌న్ లీడ్ రోల్‌లో న‌టించ‌బోతున్నారు. మ‌రోవైపు తెలుగులో ర‌ష్మిక న‌టిస్తోన్న పుష్ప ఆగ‌స్టులో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.. మరోవైపు ‘ఆడాళ్లు మీకు జోహార్లు’ సినిమాలో శర్వానంద్‌తో జోడీ కడుతోంది. అలాగే మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌, డైరెక్టర్‌ శంకర్‌ కాంబోలో వస్తున్న సినిమాలో రష్మికను హీరోయిన్‌గా తీసుకునే ఆలోచనలో ఉన్నారట.

Recent Articles English

Gallery

Recent Articles Telugu