హీరోయిన్ రష్మిక ఇటీవలే ఉపాసన నిర్వహిస్తున్న ‘యుఆర్ లైఫ్’ అనే ప్రోగామ్లో పాల్గొంది. ఈ షోలో ఇప్పటికే పలువురు స్టార్ హీరోయిన్లను వచ్చి ఆరోగ్యకరమైన వంటలు చేశారు. తాజాగా రష్మికతో వంటలు చేయించింది ఉపాసన. ‘కోలీ పుట్టు’ అనే కూర వండింది రష్మిక. దీంతో ఆమెను ఉపాసన ప్రశంసిస్తూ పలు ప్రశ్నలు అడిగింది. మీరు కోర్గి సామాజిక వర్గానికి చెందినవారా? అని, పంది మాంసం బాగా తింటారు కదా? అని ప్రశ్నసించింది ఉపాసన.
ఇన్ స్టాగ్రామ్లో మహేష్ రికార్డు
దీనికి రష్మిక స్పందిస్తూ… అవునని చెప్పింది. తాము ఇంట్లోనే వైన్ తయారు చేసుకుంటామని, అలాగే పంది మాంసం తింటామని, ఆ మాంసాన్ని కాల్చుకుని తింటే రుచి అద్భుతంగా ఉంటుందని చెప్పింది. పంది మాంసం, వైన్తో రకరకాల వంటలు చేసుకుంటామని తెలిపింది. పంది మాంసం తిని నిద్ర పోయే ముందు రెండు కప్పుల వైన్ తాగితే ఇక హాయిగా నిద్ర వస్తుందని తన ఆహార అలవాట్లను వివరించింది రష్మిక