HomeTelugu Trendingఐటీ శాఖకు పత్రాలను అందించిన రష్మిక తండ్రి

ఐటీ శాఖకు పత్రాలను అందించిన రష్మిక తండ్రి

9 16
ప్రముఖ హీరోయిన్ రష్మిక మందన్న ఇంట్లో ఈ నెలలో ఐటీ శాఖ అధికారులు తనిఖీలు జరిపిన విషయం తెలిసిందే. సంక్రాంతి పండుగ రోజు రష్మిక స్వస్థలం కర్ణాటక రాష్ట్రం విరాజ్‌పేటలోని ఆమె నివాసంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో వారు లెక్కల్లో చూపని రూ.25 లక్షల నగదుతో పాటు రూ3.94 కోట్లు విలువైన ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. రూ.1.5 కోట్లకు రష్మిక పన్ను చెల్లించలేదంటూ జాతీయ పత్రికల్లో వార్తలు వచ్చాయి. రష్మిక పేరు మీద భారీ స్థాయిలో ఆస్తులున్నట్టు ఐటీ అధికారులు గుర్తించారని కన్నడ మీడియాలో వార్త వైరల్ అవుతోంది.

రష్మిక, ఆమె తండ్రి మదన్‌ ఇద్దరూ మైసూర్‌లోని ఐటీశాఖ కార్యాలయంలో పలు డాక్యుమెంట్లను అధికారులకు అందజేశారు. అనంతరం రష్మిక తండ్రి మదన్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఐటీ శాఖ అధికారులు కొన్ని పత్రాలు అడిగారు. వాటిని ఇవ్వటానికే మేము అక్కడికి వెళ్లినట్లు తెలిపారు. ప్రస్తుతం రష్మిక మందన్న వరుస అవకాశాలతో బిజీగా ఉంది. ఇప్పటి వరకు రష్మిక చేసింది 10 సినిమాలు మాత్రమే. ప్రస్తుతం అల్లు అర్జున్‌ సినిమాతో పాటు నితిన్‌తో భీష్మ, కన్నడంలో పలు ప్రాజెక్టులకు సైన్ చేసింది. మరికొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నట్టు తెలుస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu