HomeTelugu Trendingసినీ కార్మికులకు రవితేజ విరాళం

సినీ కార్మికులకు రవితేజ విరాళం

6 28
దేశ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తుంది. రోజు రోజుకు భాదితుల సంఖ్య పెరిగిపోతుంది. ఇప్పటివరకు 979 పాజిటివ్ కేసులు నమోదైనట్టు అధికారులు గుర్తించారు. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా కలకలం సృష్టిస్తోంది. తెలంగాణాలో మొత్తం 65 పాజిటివ్ కేసులు నమోదుకాగా ఏపీలో 19 కేసులు నమోదయ్యాయి. కాగా కరోనా కారణంగా సినిమా షూటింగ్ లు కూడా నిలిపివేశారు. దాంతో ఆర్థిక స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న తెలుగు సినీ కార్మికులను ఆదుకోవ‌డంలో భాగంగా హీరో ర‌వితేజ రూ. 20 ల‌క్ష‌లు విరాళం ప్ర‌క‌టించారు. త‌న వంతుగా ఈ మొత్తాన్ని ‘క‌రోనా క్రైసిస్ చారిటీ’కి అంద‌జేస్తున్న‌ట్లు త‌న ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా ఆయ‌న తెలిపారు. ఇవ్వ‌డ‌మ‌నే విష‌యం వ‌చ్చేదాకా తీసుకోవ‌డ‌మ‌నే ప్ర‌యోజ‌నం ఎప్ప‌టికీ పూర్తికాద‌నీ రవితేజ పేర్కొన్నారు. ఇది బాధ‌ను కొల‌వ‌డం కాదు, సినీ కార్మికుల అవ‌స‌రాల‌ను తీర్చ‌డంలో తోడ్పాటు మాత్ర‌మే అని పేర్కొన్నారు. క‌రోనా సంక్షోభాన్ని ఎదుర్కోవ‌డానికి అంద‌రూ ఇంటిప‌ట్టునే సుర‌క్షితంగా ఉండాల‌ని ఆయన కోరారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu