HomeTelugu Newsరవితేజ-రానా మల్టీస్టారర్‌..!

రవితేజ-రానా మల్టీస్టారర్‌..!

14 1

మలయాళంలో తెరకెక్కిన ‘అయ్యప్పనుమ్ కొషియం’ సూపర్‌ హిట్‌ అయింది. పృథ్వీరాజ్ సుకుమారన్, బిజు మీనన్ హీరోలుగా తెరకెక్కిన ఈ సినిమాకు సచి దర్శకత్వం వహించారు. ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్‌టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ ఈ సినిమా తెలుగు రీమేక్ రైట్స్‌ను కొనుగోలు చేశారు. ఈ సినిమా నిర్మాణంలో సురేష్ ప్రొడక్షన్స్ కూడా భాగమవుతున్నట్లు తెలుస్తోంది. రెండు పవర్‌ఫుల్ క్యారెక్టర్స్ మధ్య నడిచే కథ కాబట్టి రవితేజ, రానా అయితే బాగుంటుందని చిత్ర బృందం వాళ్లను ఒప్పించారట. అలాగే, ‘స్వామిరారా’ సినిమాతో ప్రతిభావంతుడైన దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న సుధీర్ వర్మకు ఈ చిత్ర దర్శకత్వ బాధ్యతలు అప్పగిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా షూటింగ్‌ ఆగస్టులో ప్రారంభం అయ్యే అవకాశముంది. కాగా ఈ వార్తలపై అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu