HomeTelugu Newsభారత్‌లో మూడుకు చేరిన 'కరోనా' మరణాల సంఖ్య..

భారత్‌లో మూడుకు చేరిన ‘కరోనా’ మరణాల సంఖ్య..

5 15
భారత్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా మరో కరోనా వైరస్‌ మరణం సంభవించింది. మహారాష్ట్రలో వైరస్‌ సోకిన 64 ఏళ్ల వృద్ధుడు మంగళవారం మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ముంబయిలోని కస్తూర్బా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతడు మరణించినట్లు వెల్లడించారు. దీంతో భారత్‌లో కరోనా కారణంగా మృతి చెందిన వారి సంఖ్య మూడుకు చేరింది. ఈ వ్యాధి కారణంగా ఇప్పటికే ఇద్దరు మరణించిన సంగతి తెలిసిందే. వారిలో ఒకరు ఢిల్లీకి చెందిన వారు కాగా.. మరొకరు కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారు. భారత్‌లో ఇప్పటివరకూ 125 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. మరోవైపు కరోనా కట్టడికి కేంద్రంతోపాటు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu