ప్రముఖ వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మధ్యప్రదేశ్ లో చోటుచేసుకున్న ఓ ఘటనపై ఆవేదన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. ధార్ జిల్లా పిపల్వ గ్రామానికి చెందిన అక్కాచెల్లెళ్లు తమ మేనమామ కుమారులతో కొంత కాలంగా ఫోన్ లో మాట్లాడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆగ్రహంతో ఇద్దరినీ చితకబాదారు. గత నెల 22న వీరిపై దాడి జరిగింది. జుట్టు పట్టుకుని ఇద్దరినీ ఈడుస్తూ, కర్రలతో చితకబాదారు. దీనికి సంబంధించిన వీడియా సోషల్ మీడియాలో వైరల్ అయింది.
దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఏడుగురిని అరెస్ట్ చేశారు. మరోవైపు ఈ ఘటనపై రామ్ గోపాల్ వర్మ స్పందించారు. ఈ దారుణాన్ని తాను నమ్మలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేసిన వర్మ.. దాడికి పాల్పడిన వాళ్లందరికీ తగిన శిక్ష వేయకపోతే.. తనకు ఈ దేశంపై ఉన్న నమ్మకం పోతుందని పేర్కొంటూ ట్వీట్ పెట్టారు. దీంతో ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘ఆ అమ్మాయి ఏం తప్పు చేసిందనేది పక్కనబెడితే మానవత్వం మంట గలిసేలా ఇలాంటి దారుణాలకు ఒడిగట్టిన ఎవ్వరినీ వదలొద్దు’ అంటూ కామెంట్స్ చేస్తూ వర్మను నెటిజన్లు సపోర్ట్ చేస్తున్నారు.
I can’t believe what I am seeing here ..and if these filthy brutes are not in prison by now , I can’t believe in this country anymore https://t.co/w0H62fV1cW
— Ram Gopal Varma (@RGVzoomin) July 5, 2021