HomeTelugu Trendingదుర్గమ్మను దర్శించుకున్న సాయిధరమ్‌ తేజ్‌.. వైరల్‌

దుర్గమ్మను దర్శించుకున్న సాయిధరమ్‌ తేజ్‌.. వైరల్‌

sai

మెగా మేల్లుడు హీరో సాయిధరమ్‌ తేజ్‌ కుటుంబ సమేతంగా సోమవారం విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చిన ఆయనకు ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు, ప్రసాదం అందజేశారు. అనంతరం ఆలయ అర్చకులు అమ్మవారి ప్రసాదాలను, శేషవ్రస్తాలను బహూకరించారు.

ఎప్పుడూ విజయవాడ వచ్చిన తప్పకుండా అమ్మవారిని దర్శించుకుంటానని సాయి ధరమ్​ తేజ్​ తెలిపాడు. చాలా ప్రశాంత వాతావరణంలో దర్శనం జరిగిందన్నాడు. ఇటీవల సాయి ధరమ్​ తేజ్​ రోడ్డు ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. రోడ్డు ప్రమాదం తర్వాత కోలుకొని కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని మొక్కు లు చెల్లించుకున్నట్లు సాయిధరమ్‌తేజ్‌ కుటుంబ సభ్యులు తెలిపారు.

మాస్క్, తలపాగా ..పూర్తిగా గెటప్ ఛేంజ్ చేసి పబ్లిక్ లో కనిపించాడు సాయిధరమ్‌ తేజ్‌. పర్టిక్యులర్ గా చూస్తే కానీ తేజ్ అని గుర్తు పట్టలేరు. అయితే ఇంతగా ముఖం దాచుకోవాల్సిన అవసరం ఏముంది తేజ్ అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. అలా కవర్ చేయడానికి కూడా ఒక కారణం ఉందని మరికొంతమంది చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం తేజ్ కొత్త సినిమా పనుల్లో నిమగ్నమయ్యి ఉన్నాడు. ఆ లుక్ కోసం చాలా రోజుల నుంచి శ్రమిస్తున్నాడని. ఇప్పుడప్పుడే ఆ లుక్ ని రివీల్ చేయాలనుకోవడంలేదని, అందుకే ముందు జాగ్రత్తగా ముఖాన్ని కవర్ చేస్తున్నాడని చెప్పుకొస్తున్నారు.

కాజల్‌ సీమంతం ఫొటోలు వైరల్‌

Recent Articles English

Gallery

Recent Articles Telugu