టాలీవుడ్ మన్మథుడు నాగార్జున.. తాజాగా ‘వైల్డ్ డాగ్’ అనే సినిమాతో వస్తున్నాడు. నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని అహిషోర్ సాల్మోన్ దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా ఈ సినిమాలో నాగార్జున ప్రధాన పాత్రలో అలరించనుండగా.. ఓ కీలక పాత్రలో హిందీ నటీ సయామీ ఖేర్ నటించనుంది. ఈ భామ ఇంతకు ముందు సాయి ధరమ్ తేజ్ సరసన రేయ్ మూవీలో హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమా మరే తెలుగు సినిమాలో నటించలేదు. ఇన్ని రోజుల తర్వాత సయామీ మళ్లీ.. నాగ్తో ‘వైల్డ్ డాగ్’ సినిమాలో నటిస్తోంది. అయితే ఈ సినిమాలో ఆమెది రెగ్యులర్ క్యారెక్టర్ కాదనీ, పర్ఫార్మెన్సుకు బాగా ప్రాధ్యాన్యం ఉన్న పాత్రనీ, ఆ పాత్రకు ఆమె అయితే న్యాయం చేస్తున్న నమ్మకంతో దర్శక నిర్మాతలు ఆమెను ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమాకు సంబందించి ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ అందరిలో ఆసక్తిని రేకెత్తించింది. నిజ జీవిత ఘటనలను ఆధారంగా చేసుకుని తీర్చిదిద్దిన ‘వైల్డ్ డాగ్’ విజయ్ వర్మ పాత్రలో అక్కినేని నాగార్జున అద్భుతంగా నటిస్తున్నారనీ, ప్రేక్షకులకు ఈ చిత్రం ఒక కొత్త అనుభూతినిస్తుందనీ చిత్ర బృందం వెల్లడించింది. ఈ సినిమాలో మరో ముఖ్య పాత్రలో దియా మీర్జా నటిస్తోంది.