HomeTelugu Trendingన్యూయర్‌ సెలబ్రెషన్స్‌కి బయలుదేరిన చైసామ్‌.. ఫొటో వైరల్‌

న్యూయర్‌ సెలబ్రెషన్స్‌కి బయలుదేరిన చైసామ్‌.. ఫొటో వైరల్‌

samantha
2021 న్యూ ఇయర్‌ సెలబ్రెషన్స్‌కి అందరూ రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్‌ క్యూట్‌ కపూల్‌ సమంత, చైతన్య కొత్త సంవత్సరాని సెలబ్రేషన్స్‌ జరుపుకునేందుకు మంగళవారం గోవా బయల్దేరారు. ఈరోజు ఉదయం హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు నుంచి గోవా బయల్దేరారు. ఈ నేపథ్యంలో చైతన్యతో కలిసి సమంత ఎయిర్‌పోర్టులోకి వెళుతుండగా కెమెరాకు చిక్కారు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

ఎయిర్‌పోర్టులో ఈ ఇద్దరూ ముఖానికి మాస్కు ధరించి కనిపించారు. ఇదిలా ఉండగా నవంబర్‌ చివరి వారంలో నాగ చైతన్య 34వ పుట్టినరోజును సమంత మాల్దీవుల్లో సెలబ్రేట్‌ చేసిన విషయం తెలిసిందే. మాల్దీవుల వెకేషన్‌ అనంతరం వీరిద్దరూ ప్రస్తుతం గోవా వెళుతున్నారు. గోవాలోని ప్లష్‌ రిసార్ట్‌లో న్యూ ఇయర్‌ వేడుకలు జరుపుకోనున్నారు. కాగా చైసామ్‌కు ఇష్టమైన ప్రదేశాల్లో గోవా ఒకటి. 2017లో గోవాలోని ఓ రిసార్ట్‌లోనే వీరి వివాహం జరిగింది. 2017 అక్టోబర్‌ 6న హిందూ సాంప్రదాయం ప్రకారం ఈ జంట ఏడడుగులు వేయగా.. అక్టోబర్‌ 7న గోవాలో క్రిస్టియన్‌ పద్దతిలో వివాహాం జరిగింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu