మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్లో ‘ఆచార్య’ సినిమాలో నటిస్తున్నాడు. ఆ తరువాత మలయాళం లో సూపర్ హిట్ అయిన ‘లూసిఫర్’ సినిమాను తెలుగులో రీమేక్ చేయనున్నారు. అయితే ఈ సినిమాను మలయాళంలో సూపర్ స్టార్ మోహన్ లాల్ చేశారు. ఈ సినిమాను తెలుగులో తమిళ దర్శకుడు మోహన్ రాజా డైరెక్ట్ చేయనున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త బయటికి వచ్చింది. మలయాళం లూసిఫర్ లో మరో హీరో ”పృథ్వీరాజ్ సుకుమారన్” ఓ ముఖ్య పాత్రలో నటించారు. అయితే తెలుగు రీమేక్ లో టాలీవుడ్ యువ నటుడు హీరో సత్య దేవ్ ఆ పాత్రలో నటిస్తున్నాడు. దీనిపై అధికారీకంగా ప్రకటన రావాల్సి ఉంది.