టాలీవుడ్లో ‘అఖిల్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన చిత్రం సాయేషా సైగల్. అనంతరం తమిళ ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చి యంగ్ హీరో ఆర్యను వివాహం చేసుకొని చెన్నైలో సెటిలైపోయింది ఈ బ్యూటీ. తాజాగా ఈ అమ్మడికి టాలీవుడ్లో ఆఫర్ వచ్చింది. నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబిషన్లో వస్తున్న మూడో చిత్రమిది కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మార్చిలో స్టార్ అయిన ఈసినిమా షూటింగ్ కరోనా కారణంగా వాయిదా పడింది. తాజాగా హైదరాబాద్లో చిత్రీకరణ జరుగుతోంది. కాగా ఈ సినిమాలో ఓ హీరోయిన్గా సాయేషా సైగల్ను ఎంపిక చేశారు. మిర్యాల రవీందర్రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ స్వరాల్ని అందిస్తున్నారు. వేసవిలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.