HomeTelugu Big Storiesపొట్టి వీరయ్య క‌న్నుమూత‌

పొట్టి వీరయ్య క‌న్నుమూత‌

Senior actor potti veeraiah

కరోనా సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో ఇప్పటికే పలువురు సినీ సెలెబ్రిటీలు ఈ లోకాన్ని విడిచి వెళ్తున్నారు. ఇప్పుడు టాలీవుడ్‌లో ఓ నటుడు మృతిచెందారు. సినీ నటుడు పొట్టి వీరయ్య (74) ఇకలేరు. గత కొంత కాలం నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆదివారం తన నివాసంలో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. పొట్టి వీరయ్య అసలు పేరు గట్టు వీరయ్య. విఠలాచార్య ‘అగ్గిదొర’ చిత్రంతో మరుగుజ్జు నటుడిగా తెలుగు సినిమాకు పరిచయం అయ్యారు. రాధమ్మ పెళ్లి, తాతా మనవడు, టార్జాన్ సుందరి, జగన్మోహిని, పేదరాసి పెద్దమ్మ కథ, కృష్ణ గారడీ వంటి పలు చిత్రాల్లో పొట్టివీరయ్య వివిధ రకాల పాత్రల్లో నటించారు. పొట్టి వీరయ్య సొంత జిల్లా నల్గొండ.

ఇక ఈయన మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఓ సారి వీరయ్య అనారోగ్య పరిస్థితి బాగా లేని సమయంలో చిరంజీవి రెండు లక్షల ఆర్థిక సాయాన్ని చేసిన సంగతి తెలిసిందే. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరుపున చిరంజీవి చేసిన ఆర్థిక సాయాన్ని తలుచుకుని ఆనాడు పొట్టి వీరయ్య ఎంతగానో ఎమోషనల్ అయ్యారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu