HomeTelugu Big Storiesమూడు రాజధానులపై షకీలా సెటైర్లు

మూడు రాజధానులపై షకీలా సెటైర్లు

10 3

షకీలా తాజాగా ‘షకీలా రాసిన మొట్ట మొదటి కుటుంబ కథా చిత్రం’ అనే సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రంలో షకీలా ప్రధాన పాత్రలో విక్రాంత్, పల్లవి ఘోష్‌ జంటగా నటించారు. సాయిరాం దాసరి దర్శకత్వ పర్యవేక్షణలో సతీష్‌ వి.ఎన్‌ దర్శకత్వం వహించగా..24 క్రాఫ్ట్స్‌ బ్యానర్‌పై సీవీ రెడ్డి సమర్పణలో సీహెచ్‌ వెంకట్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీకి సంబంధించిన టీజర్ ఇటీవలే విడుదలయింది. ఈ క్రమంలో ఏపీ మూడు రాజధానులపై సినీ నటి షకీలా పంచ్‌లు వేసింది. షకీలా పేపర్ చదువుతూ ఆంధ్రాకి మూడు రాజధానులు అనే వార్తను చదువుతుంది. ఆంధ్రకు మూడు రాజధానులేంటని.. తన అసిస్టెంట్‌ను ప్రశ్నిస్తుంది. అవును మేడం.. జగనన్న మూడు రాజధానులు చేశాడని అతడు చెబుతాడు. దాంతో షాకైన షకీలా..” ఒక్క స్టేట్‌కే మూడు రాజధానులా? పోనుపోను ఒక్క రాష్ట్రానికి ముగ్గురు ముఖ్యమంత్రులైనా ఆశ్చర్యపోనవసరం లేదు” అని పంచ్
వేస్తుంది షకీలా. ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu