HomeTelugu Trendingఅంతర్వేది లక్ష్మీనృసింహస్వామిని దర్శంచుకున్న శర్వానంద్‌, రష్మిక

అంతర్వేది లక్ష్మీనృసింహస్వామిని దర్శంచుకున్న శర్వానంద్‌, రష్మిక

Sharwanand and rashmika vis
అంతర్వేది లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో ‘ఆడవాళ్లూ మీకు జోహార్లు’ మూవీ యూనిట్‌ సందడి చేశారు. హీరో హీరోయిన్లు శర్వానంద్, రష్మికా మంధన్న గురువారం స్వామి వారికి వారు ప్రత్యేక పూజలు చేశారు. వారికి ప్రధానార్చకుడు పాణింగిపల్లి శ్రీనివాస కిరణ్, వేద పండితుడు చింతా వేంకటశాస్త్రి ఆశీర్వచనాలు తెలిపారు. క్షేత్ర మహాత్మ్యం గురించి వారు అర్చకులను అడిగి తెలుసుకున్నారు.

లక్ష్మీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ నిర్మాణ సారథ్యంలో తిరుమల కిశోర్‌ దర్శకత్వంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఈ సందర్భంగా శర్వానంద్, రష్మిక మాట్లాడుతూ, గోదావరి తీరం చాలా ఆహ్లాదకరంగా ఉందన్నారు. చక్కటి వాతావరణం, కొబ్బరి తోటలు, పంట పొలాలు కనువిందు చేస్తున్నాయని అన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu