రితేశ్ దేశ్ముఖ్, సిద్ధార్థ మల్హోత్ర కీలక పాత్రల్లో నటించిన యాక్షన్ అండ్ రొమాంటిక్ చిత్రం ‘మార్జావాన్’. మిలాప్ ఝవేరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తారా సుతారియా, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్లు. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. నవంబరు 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి సంబంధించిన
ట్రైలర్ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ సినిమాలో రితేశ్ దేశ్ముఖ్ మూడు అడుగుల వ్యక్తిగా కనిపించారు. ‘భయం ఎత్తు తెలుసా నీకు? మూడు అడుగులు. నేను రాక్షసుడిని కాదు. నేనో అవతార పురుషుడిని’ అంటూ ఆయన చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటోంది. టీ-సిరీస్, ఎమ్మే ఎంటర్టైన్మెంట్ పతాకంపై భూషణ్కుమార్, కృష్ణకుమార్,
దివ్య కోసలా కుమార్ తదితరులు నిర్మిస్తున్నారు. తనిష్ బాగ్చి, మీట్ బ్రోస్, పాయల్ దేవ్ స్వరాలు సమకూర్చగా, సంజయ్ చౌదరి నేపథ్య సంగీతం అందించారు.