HomeTelugu Trendingహేమచంద్ర, శ్రావణ భార్గవి జంటకు ఏమైంది?

హేమచంద్ర, శ్రావణ భార్గవి జంటకు ఏమైంది?

Singer couple Hemachandra
పాపులర్ సింగర్స్ శ్రావణ భార్గవి, హేమచంద్ర జంట విడాకులు తీసుకుంటున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. టాలీవుడ్‌లో వీరిద్దరు చాలా ఫేమస్ అయ్యారు. సింగర్‌గానే కాకుండా డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా కూడా హేమచంద్ర చాలా పాపులర్‌. శ్రావణ భార్గవి, హేమచంద్ర ప్రేమించి, పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నారు. 2013లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరిద్దరికి 2016లో ఓ కుమార్తె జన్మించింది. పెళ్లి తర్వాత కూడా హేమచంద్ర, శ్రావణ భార్గవి కలిసి పలు మ్యూజికల్ ఈవెంట్స్ చేశారు.

సినీ పరిశ్రమలో విడాకుల వార్తలు హాట్‌ టాపిక్‌గా మారుతున్నాయి. టాలీవుడ్‌లో క్యూట్‌ పెయిర్‌ నాగ చైతన్య, సమంత విడాకులతో తెగదెంపులు చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా మరో జంట శ్రావణ భార్గవి, హేమచంద్ర విడాకులకు సిద్ధమైందంటూ సోషల్‌ మీడియాలో వార్తలు వస్తున్నాయి. వీరు తమ వివాహ బంధానికి స్వస్తి పలకనున్నట్లు కొద్దిరోజులుగా కథనాలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలపై హేమచంద్ర, శ్రావణ భార్గవి ఇద్దరూ స్పందించకపోవడం నిజమే అని గట్టిగా ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలో ఎంత నిజముందో తెలియాలంటే వీరిద్దరిలో ఎవరో ఒకరు స్పందించాల్సిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu