HomeTelugu Newsతెలంగాణలో భారీగా కరోనా కేసులు, ఒకేరోజు ఆరుగురు మృతి

తెలంగాణలో భారీగా కరోనా కేసులు, ఒకేరోజు ఆరుగురు మృతి

13 11
తెలంగాణలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. ఇవాళ కొత్తగా 107 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి, మరో ఆరుగురు మృతిచెందారు. దీంతో తెలంగాణలో కరోనాతో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 63కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 1842కి చేరింది. తెలంగాణలో ప్రస్తుతం కరోనాతో 714 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకుని 1321 మంది డిశ్చార్జి అయ్యారు.

ఇవాళ కొత్తగా నమోదైన 107 పాజిటివ్ కేసుల్లో 39 మంది తెలంగాణకు చెందిన వారు కాగా, వలసకార్మికులు 19 మందికి విదేశాల నుంచి వచ్చిన 49 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. లాక్‌డౌన్ సడలింపులు ఇవ్వడంతో ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి తెలంగాణకు వస్తున్న వారిలో కరోనా పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నట్టు అధికారులు తెలిపారు. అందువలన వీరి సంఖ్యను వేరుగా చూపించాలని అధికారులు నిర్ణయించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu