HomeTelugu Newsసోనూసూద్‌ దాతృత్వం.. తన హోటల్‌ ని వసతిగా..

సోనూసూద్‌ దాతృత్వం.. తన హోటల్‌ ని వసతిగా..

11 7
కరోనా వైరస్‌ విజృంభిస్తున్న సమయంలో సినీతారలు తమవంతు సాయం చేస్తున్నారు. కరోనా కట్టడి కోసం తమవంతు ప్రయత్నంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకి విరాళాలు అందిస్తున్నారు. మరికొందరు సినీ కార్మికులకి, పేదలకి ఆసరాగా నిలుస్తున్నారు. తాజాగా సోనూసూద్ ఈ స్టార్‌ విలన్‌ తన హోటల్‌ను వైధ్య సిబ్బంది కోసం వినియోగించుకోవాలని ముంబై కర్పోరేషన్‌ అధికారులను కోరాడు. ప్రస్తుతం కరోనా పేషంట్లకు సేవలందిస్తున్న చాలా మంది వైధ్యులు ఇళ్లకు కూడా వెళ్లకుండా హాస్పిటల్స్‌లోనే ఉంటున్నారు.

అలాంటి వారికి తన హోటల్‌లో వసతి ఏర్పాట్లు చేయాలంటూ ఆయను సూచించాడు.ఈ విపత్కర పరిస్థితులలో పగలు మరియు రాత్రి అని తేడా లేకుండా.. అలసిపోకుండా పనిచేస్తున్న జాతీయ వీరులకు మద్దతుగా, ఆరోగ్య సంరక్షణ కార్మికులందరికీ నేను జుహులోని హోటల్ తెరుస్తాను. ఈ హీరోలు చేస్తున్న డ్యూటీని పరిశీలిస్తే ప్రస్తుతం, నేను వారికి చేయగలిగినది ఇదే. మనమందరం కలిసి ఉన్నాము, అందరం ముందుకు వచ్చి వారికి మద్దతు ఇద్దాం’అని సోనూసూద్ పేర్కొన్నాడు. ఇటీవల బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్‌ ఖాన్ కూడా తన 4 అంతస్థుల ఆఫీస్ బిల్డింగ్‌ను కరోనా పేషంట్ల క్వారెంటైన్‌ కోసం వినియోగించుకోవాలంటూ సూచించిన విషయం తెలిసిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu