HomeTelugu Trendingపిల్లో ఛాలెంజ్‌ స్వీకరించిన తెలుగు స్టార్ హీరోయిన్

పిల్లో ఛాలెంజ్‌ స్వీకరించిన తెలుగు స్టార్ హీరోయిన్

10 23
చైనాలోని వూహాన్‌లో పుట్టి ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారితో ప్రజలు ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని బతుకున్నారు. కరోనా కారణంగా చాలా దేశాల్లో లాక్ డౌన్ కొనసాగుతోంది. సెలబ్రిటీలు. క్రీడాకారులు, ప్రముఖులతో పాటు సాధారణ ప్రజల వరకూ అందరూ ఇళ్లలోనే ఉండాల్సి వస్తుంది. ఈ సమయంలో “పిల్లో ఛాలెంజ్” బాగా పాపులర్ అయింది. ఇంట్లో ఉంటున్న ప్రేక్షకులకు కూడా బోర్‌ కొట్టకుండా ఇలాంటి ఛాలెంజ్‌లను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఈ పిల్లో ఛాలెంజ్ స్వీకరించిన పాయల్ రాజ్‌పుత్ తన అందాలను ఆరబోసింది. ఆ తర్వాత తమిళంలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న పరుల్ యాదవ్ కూడా పాయల్ రాజ్‌పుత్‌ కంటే చిన్న పిల్లోతో ఛాలెంజ్‌లో పాల్గొని అందరినీ ఆకట్టుకుంది. ఇప్పుడు అదే ఛాలెంజ్‌ను మరో హీరోయిన్ కూడా స్వీకరించింది. మన మిల్కీ బ్యూటీ తమన్నా. కానీ తాను మాత్రం వెరైటీగా పిల్లో అడ్డుపెట్టుకుని పడుకొని ఆ ఛాలెంజ్‌ను పూర్తి చేసింది. తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఉన్న తమన్నా ఈ ఛాలెంజ్‌ను స్వీకరించడం.. పిల్లో అడ్డుపెట్టుకుని తన అందాలను చూపిస్తూ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. ఈ ఛాలెంజ్‌ను తర్వాత ఎవరు స్వీకరిస్తారో నని అభిమానుల్లో ఆసక్తి పెరిగిపోయింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!