HomeTelugu Big Storiesగ్రాండ్‌గా ప్రారంభమైన బిగ్‌బాస్‌-3

గ్రాండ్‌గా ప్రారంభమైన బిగ్‌బాస్‌-3

9 20టాలీవుడ్‌ మన్మధుడు నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘బిగ్‌బాస్‌-3’ ఈ రోజు అట్టహసంగా ప్రారంభమైంది. ఈ నవ మన్మధుడు తన ఇమేజ్‌కు తగ్గట్టుగానే అందమైన భామలతో డ్యాన్స్‌ చేస్తూ.. గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చాడు. నాగార్జున తన పాటు కోతి బోమ్మను(పండు) ని తొడు తెచ్చుకున్నారు. తరువాత పద్దతి ప్రకారమే.. హౌస్‌ను పరిచయం చేశాడు.. లోపల బిగ్‌బాస్‌ ఇచ్చిన టాస్క్‌ మేరకు ముగ్గురు ఇంటి సభ్యుల పేర్లను లక్కీ డిప్‌ పద్దతిలో సెలెక్ట్‌ చేశాడు.. ఈ తరువాత వరుసగా వారిని పరిచయం చేశాడు. మొదటిగా తీన్మార్‌ సావిత్రి (శివజ్యోతి), రెండో సభ్యుడిగా రవికృష్ణ, మూడో సభ్యుడిగా అషూరెడ్డి(డబ్‌స్మాష్‌ స్టార్‌)లను ఇంటిలోకి పంపించారు..

అయితే ఈ సారి బిగ్‌బాస్‌ సరికొత్త పద్దతిని ప్రవేశపెట్టాడు.. ముందుగా లోపలికి వెళ్లిన ఈ ముగ్గురు సభ్యులకు టాస్క్‌ ఇచ్చాడు.. ఇకపై ఇంట్లోకి ప్రవేశించే సభ్యులకు ప్రశ్నలు వేసి వారి గురించి అంచనా వేయాలి అని టాస్క్‌ ఇచ్చాడు. నాలుగో సభ్యుడిగా టీవీ9 జర్నలిస్ట్‌ జాఫర్‌ ఎంట్రీ ఇచ్చాడు. ఇంటిలో రెండో సభ్యుడు రవికృష్ణ.. జాఫర్‌ ను 3 ప్రశ్నలు అడిగాడు.. ఐదో కంటెస్టెంట్‌గా సీరియల్‌ నటి హిమజ, ఆరో కంటెస్టెంట్‌గా సింగర్‌ రాహుల్‌ సిప్లిగంజ్, ఏడో కంటెస్టెంట్‌గా నటి రోహిణి, ఎనిమిదో కంటెస్టెంట్‌గా బాబా భాస్కర్‌ మాస్టర్‌ ఎంట్రీ ఇచ్చాడు, తొమ్మిదో కంటెస్టెంట్‌ ఉయ్యాలజంపాల ఫేం పునర్ణవి భూపాలం, పదో కంటెస్టెంట్‌గా సీనియర్‌ నటి హేమ ఎంట్రీ ఇచ్చారు. పదో కంటెస్టెంట్‌గా పదకొండో కంటెస్టెంట్‌గా అలీ రెజా, పన్నెండో కంటెస్టెంట్‌గా ఫన్‌ బకెట్‌ మహేష్‌ విట్టా, పదమూడో కంటెస్టెంట్‌గా హాట్‌ యాంకర్‌ శ్రీముఖి, పదనాల్గో కంటెస్టెంట్ గా వరుణ్‌ సందేశ్‌, అతడి భార్య వితికా షేరు ఎంట్రీ ఇచ్చారు

Recent Articles English

Gallery

Recent Articles Telugu