HomeTelugu Trendingవిషాదం: సీరియల్‌ నటి ఆత్మహత్య

విషాదం: సీరియల్‌ నటి ఆత్మహత్య

Telugu tv actress sravani cమనసు మమత సీరియల్ నటి నికితా శర్మ ఆత్మహత్య చేసుకోవడం హైదరాబాద్‌లో కలకలం సృష్టిస్తోంది.. ఎస్‌ఆర్‌ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మధుర నగర్ హెచ్ 56 బ్లాక్ రెండో అంతస్తులో నివసిస్తున్న తెలుగు టీవీ సీరియల్ నటి కొండపల్లి శ్రావణి ఆత్మహత్యకు పాల్పడింది. గత ఎనిమిది సంవత్సరల నుండి పలు టీవీ సీరియల్స్‌లో నటించింది తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం మౌనరాగం, మనసుమమతతో పాటు పలు సీరియళ్లలో నటిస్తున్నారు. అయితే, ఆమె ఆత్మహత్యకు టిక్‌టాక్‌లో పరిచయమైన వ్యక్తి వేధింపులే కారణం అంటున్నారు కుటుంబసభ్యులు.

శ్రావణికి కొన్ని సంవత్సరాల క్రితం కాకినాడ గొల్లప్రోలుకు చెందిన దేవరాజు రెడ్డితో టిక్‌టాక్‌లో పరిచయం ఏర్పడింది.. ఆ తర్వాత శ్రావణిని వేధింపులకు గురి చేసేవాడని కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఇక, దేవరాజు రెడ్డిపై ఎస్‌ఆర్‌ నగర్ పోలీస్ స్టేషన్‌లో శ్రావణి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. మరోవైపు శ్రావణి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మా అక్క చావుకి కారణం అయిన దేవరాజ్ రెడ్డిని కఠినంగా శిక్షించాలని మృతురాలి తమ్ముడు మీడియా ముందు గోడు వెళ్లబోసుకున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu