HomeTelugu Trendingమోసం చేసేవారికి నో చెబుతాను.. శ్రియ ఆసక్తికర వ్యాఖ్యలు

మోసం చేసేవారికి నో చెబుతాను.. శ్రియ ఆసక్తికర వ్యాఖ్యలు

5 22
టాలీవుడ్‌ ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ముద్దుగుమ్మ శ్రియ. పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిలైపోయింది ఈ బ్యూటీ తన వైవాహిక జీవితాన్ని ఆనందంగా గడుపుతోంది. పెళ్లైన తర్వాత కూడా కొన్ని స్పెషల్ సాంగ్స్ లో నటించింది. అయితే మంచి కథ దొరికితేనే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తానని అంటోంది ఈ అమ్మడు. వచ్చిన పాత్రలన్నింటినీ ఒప్పుకోవాల్సిన అవసరం లేదని చెప్పింది. ఇదే కాకుండా మరో కారణం కూడా ఉందని… దర్శకనిర్మాతలు కొందరు మోసం చేస్తున్నారని ఆరోపించింది. చెప్పే కథ ఒకటి… తీసే కథ మరొకటని మండిపడింది. ఇలాంటి అనుభవాలు ఈ మధ్య కాలంలో మరీ ఎక్కువవుతున్నాయని చెప్పింది.

ఒకటి రెండు లైన్ల కథ చెప్పి, మోసం చేయాలనుకునే వారికి ‘నో’ చెబుతున్నానని శ్రియ తెలిపింది. స్పెషల్ సాంగ్స్ చేసేందుకు హీరోయిన్లు భయపడే సమయంలో వాటిని తాను చేశానని చెప్పింది. ఇలాంటి పాటల్లో నటిస్తే హీరోయిన్ గా అవకాశాలు రావేమోనని హీరోయిన్లు భయపడేవారని… ఆ భయాలను పారద్రోలాలని తాను అనుకున్నానని తెలిపింది. అయితే తాను స్పెషల్ సాంగ్ చేయాలంటే… సినిమాలో ఆ పాటకు చాలా ప్రాధాన్యత ఉండాలని చెప్పింది. సినిమాకు ఆ పాట ప్లస్ కావాలని, అప్పుడే ఆ పాట చేస్తానని స్పష్టం చేసింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu