HomeTelugu Big Storiesకమెడియన్ వేణుమాధవ్‌ కన్నుమూత

కమెడియన్ వేణుమాధవ్‌ కన్నుమూత

7 23టాలీవుడ్‌ లో కమెడియన్ గా మెప్పించిన వేణుమాధవ్ గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. సికింద్రాబాద్ లోని ఓ ప్రముఖ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితమే మరణించాడు. కాలేయం, కిడ్నీ సంబంధిత వ్యాధితో గత కొన్ని రోజులుగా బాధపడుతున్నారు. వేణు మాధవ్ ఇక లేరు అన్న సంగతి తెలుసుకున్న సినీ పరిశ్రమ దిగ్బ్రాంతి చెందింది. వేణుమాధవ్ కుటుంబానికి తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపింది.

ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన సంప్రదాయం సినిమాతో కమెడియన్ గా వెండితెరకు పరిచయం అయ్యారు. ఇప్పటి వరకు దాదాపు 300 సినిమాల్లో వేణుమాధవ్ నటించారు. తొలిప్రేమ, తమ్ముడు, లక్ష్మి వంటి సినిమాల్లో మంచి పేరు తెచ్చుకున్నాడు వేణు మాధవ్.

Recent Articles English

Gallery

Recent Articles Telugu