HomeTelugu Big Storiesమెగా నవ, యువ హీరో వైష్ణవ తేజ్ సినిమా ప్రారంభోత్సవం

మెగా నవ, యువ హీరో వైష్ణవ తేజ్ సినిమా ప్రారంభోత్సవం

3 22మెగా ఫ్యామిలీ నుండి చిరంజీవి తర్వాత పవన్, అల్లు అర్జున్, రామ్ చరణ్, వరుణ్ తేజ్, ధరమ్ తేజ్, అల్లు శిరీష్, కళ్యాణ్ దేవ్ ఇలా 8 మంది హీరోలు పరిశ్రమకు వచ్చారు. ఇప్పడు 9వ నెంబర్ హీరో ఎంట్రీ ఇవ్వనున్నాడు. అతనే చిరు మేనల్లుడు, ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ తేజ్. ఈరోజు ఆయన తొలి సినిమా ప్రారంభోత్సవ వేడుక హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. వేడకకు చిరంజీవి, అల్లు అరవింద్‌, ధరమ్‌ తేజ్‌, నాగబాబు, అల్లు అర్జున్‌, రామ్‌చరణ్‌, సుకుమార్‌, దేవిశ్రీ ప్రసాద్‌ తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. ‘నాకు మైత్రి మూవీ మేకర్స్‌లాంటి మంచి నిర్మాణ సంస్థతో కలిసి పనిచేసే అవకాశం రాలేదు. కానీ ఆ అవకాశం నా మేనల్లుడికి తొలి చిత్రంతోనే దక్కింది. ఆ విషయంలో వాడెంతో అదృష్టవంతుడు. ఆదివారం విడుదలైన ప్రీలుక్‌ చూడగానే నాకు ‘రంగస్థలం’ గుర్తొచ్చింది. మైత్రి మూవీ మేకర్స్‌ నిర్మించిన ఈ చిత్రం ఎంతటి విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే. అదే విధంగా వైష్ణవ్‌ కూడా మంచి హిట్‌ అందుకుంటాడని ఆశిస్తున్నాను’ అన్నారు.

3a 1

అల్లు అరవింద్‌ మాట్లాడుతూ.. ‘సుకుమార్‌ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్‌ సినిమాను తెరకెక్కిస్తోంది కాబట్టి ఇది ఎంత మంచి చిత్రమో మనం ముందే ఊహించగలం. సుకుమార్‌ రైటింగ్స్‌ అంటే సినిమా విభిన్నంగా ఉంటుందని ముందే చెప్పేయొచ్చు. ఎందుకంటే ఆయన మామూలు సినిమా కథను రాయడానికి వీలుండదు. మీకు మరో ఆసక్తికరమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. వైష్ణవ్‌ తేజ్‌కు ఇదే మొదటి సినిమా అనుకుంటున్నారేమో. వాడి మొదటి సినిమా నాది. మొదటి చెక్కూ నేనే ఇచ్చాను. పవన్‌ కల్యాణ్‌ నటించిన ‘జానీ’ చిత్రంలో పవన్‌ చిన్నప్పటి పాత్రలో నటించింది వైష్ణవే’ అని వెల్లడించారు అరవింద్‌.

Recent Articles English

Gallery

Recent Articles Telugu