మెగా హీరో వరుణ్ తేజ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో 14 రీల్స్ ప్లస్ బ్యానర్పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మించిన సినిమా ‘వాల్మీకి’. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తుంది. యువ సంగీత దర్శకుడు మిక్కీ జె. మేయర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. ఇక.. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా విడుదలకు ఏర్పాట్లు చేశారు.. అయితే, ఈ సినిమా టైటిల్పై వివాదం నడుస్తోంది. సినిమా టైటిల్ను మార్చాలని బోయ సంఘం, వాల్మీకి వర్గం డిమాండ్ చేస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలో చివరి క్షణాల్లో సినిమా పేరును ‘గద్దలకొండ గణేష్’ గా మార్చినట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది.
వాల్మీకి సంఘాల ఆందోళన నేపథ్యంలో పలు జిల్లాల్లో వాల్మీకి చిత్రాన్ని నిలిపివేయాలని మొదట నిర్ణయించారు. ఆందోళనల దృష్ట్యా కర్నూల్, అనంతపురం జిల్లాల్లో సినిమాను ప్రదర్శించవద్దని థియేటర్ యాజమాన్యాలను కలెక్టర్లు ఆదేశించారు. అలా జరిగితే సినిమాకు ఇబ్బందులు కల్గుతాయని భావించిన 14 రీల్స్ నిర్మాణ సంస్థ దిగొచ్చింది. సినిమా విడుదలకు కొన్ని గంటల ముందు వాల్మీకి టైటిల్ను మార్చి ప్రకటన విడుదల చేసింది. తమిళ్ మూవీ ‘జిగర్ తాండా’కు రీమేక్గా తెరకెక్కిన ఈ మూవీలో గద్దలకొండ గణేష్ పాత్రలో వరుణ్ తేజ్ కనిపించనున్నాడు. ఇక, నితిన్ గెస్ట్రోల్లో మెరవబోతున్నాడు. ఈ మూవీపై మంచి అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో చేతులు కాల్చుకోవడం ఎందుకనే ఉద్దేశంతో హీరో పోషిస్తున్న పాత్రపేరునే “గద్దలకొండ గణేష్”ను సినిమా టైటిల్గా మార్చారు.