HomeTelugu Newsఅనాథ పిల్లలకు వెంకీ కానుకలు.. ఫొటోలు వైరల్‌

అనాథ పిల్లలకు వెంకీ కానుకలు.. ఫొటోలు వైరల్‌

11 15
టాలీవుడ్‌ విక్టరీ వెంకటేష్‌ అనాథ పిల్లల కోసం ‘వెంకీ మామా’ సినిమా ప్రత్యేక స్క్రీనింగ్‌ను ఏర్పాటు చేశారు. చిన్నారులతో కలిసి సరదాగా సమయం గడిపారు. ఈ సందర్భంగా ఆయన పిల్లలతో కలిసి తీసుకున్న ఫొటోలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వెంకీ, చిన్నారులు భావోద్వేగానికి గురైనట్లు ఫొటోల్ని బట్టి తెలుస్తోంది. చిన్నారుల్ని ఆప్యాయంగా హత్తుకుని, చాలా సంతోషంగా వెంకీ కనిపించారు. అంతేకాదు ఆయన క్రిస్మస్‌ సందర్భంగా పిల్లలకు కానుకలు కూడా ఇచ్చారు.

డిసెంబరు 13న విడుదలైన ‘వెంకీ మామ’ సినిమా మంచి స్పందన అందుకోవడంతోపాటు బాక్సాఫీసు వద్ద చక్కటి వసూళ్లు రాబడుతోంది. ఈ ఏడాది ‘ఎఫ్‌ 2’తో సక్సెస్‌ అందుకున్న వెంకటేష్‌, ‘మజిలీ’తో విజయం అందుకున్న నాగచైతన్య కెరీర్‌లో ఇది మరో హిట్‌గా నిలిచింది. బాబీ సినిమాకు దర్శకత్వం వహించారు. రాశీ ఖన్నా, పాయల్‌ రాజ్‌పుత్‌ కథానాయికలు. ఈ చిత్ర బృందం కోసం వెంకీ ప్రత్యేకంగా పార్టీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu