టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఫ్యామిలీ నుంచి ఆశిష్ రెడ్డి హీరోగా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ‘రౌడీ బాయ్స్’ పేరుతో వస్తున్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తుంది.
సంక్రాంతి కానుకగా ఈ నెల 14వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఒక లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ‘ఏ జిందగీ … ఓ యూనివర్సిటీ .. ఈ దోసితీ లేదంటే చీకటి’ అంటూ ఈ పాట సాగుతోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం .. కృష్ణకాంత్ సాహిత్యం .. రామ్ మిర్యాల ఆలాపనతో ఈ సాంగ్ అలరిస్తోంది. కాలేజ్ కి బంక్ కొట్టినప్పుడు .. ఫస్టు టైమ్ మందు కొట్టేటప్పుడు .. డ్రంకెన్ డ్రైవ్ లో దొరికిపోయినప్పుడు నీ పక్కన ఉండేది ఫ్రెండ్ ఒక్కడే అనే అర్థంలో ఈ పాట నడుస్తోంది.