HomeTelugu Newsఇఫ్తార్ విందులో స్వీట్లు తినిపించుకున్న జగన్, కేసీఆర్

ఇఫ్తార్ విందులో స్వీట్లు తినిపించుకున్న జగన్, కేసీఆర్

11a
హైదరాబాద్ రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తెలంగాణ మంత్రులు హజరయ్యారు. రాజ్ భవన్ లోని సాంస్కృతిక మందిరంలో జరిగిన ఇఫ్తార్ విందులో ముస్లిం మతపెద్దలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఇరువురు ముఖ్యమంత్రులు స్వీట్లు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ నరసింహన్ ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అంతకు ముందు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గవర్నర్ నరసింహన్ తో గంటకు పైగా భేటీ అయ్యారు. ఇరు రాష్ట్రాలకు సంబంధించిన పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu