HomeTelugu Newsవైసీపీ ఎంపీలకు సీఎం జగన్‌ సూచన

వైసీపీ ఎంపీలకు సీఎం జగన్‌ సూచన

7 14ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా వచ్చే వరకు అడుగుతూనే ఉండాలని, కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు రాబట్టేందుకు ఎప్పటికప్పుడు గళం వినిపించాలని వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్‌ పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. ఢిల్లీలోని ఏపీ భవన్‌లో జగన్‌ అధ్యక్షతన నిర్వహించిన వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. పార్లమెంట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధానంగా సమాలోచనలు చేశారు. సమస్యల పరిష్కారానికి కలిసికట్టుగా పనిచేయాలని ఎంపీలకు సూచించారు. శాఖల వారీగా సమస్యల పరిష్కారానికి ఎంపీల బృందం ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయించారు. ఒక్కో బృందానికి కొన్ని శాఖలను అప్పగించనున్నారు. శాఖల నుంచి నిధుల విడుదలకు ఆయా బృందాలు పనిచేయాలని జగన్‌ సూచించారు. సమావేశం ముగిసిన తర్వాత హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ మాట్లాడుతూ… ప్రధానంగా ప్రత్యేక హోదా అంశంపైనే దృష్టి పెడతామని చెప్పారు. బీజేపీతో సత్సంబంధాలు కొనసాగుతాయని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu