తెలుగులో అవకాశాలు లేక బాలీవుడ్ కు వెళ్లిన గోవా బ్యూటీ ఇలియానాకు అక్కడ కూడా అవకాశాలు లేకపోవడంతో తను ప్రేమించిన వ్యక్తిని పెళ్లిచేసుకుంది. బ్యాక్ టు పెవిలియన్ గా మళ్లీ టాలీవుడ్ లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టబోతుందట ఇల్లీ బేబీ.
శ్రీనువైట్ల దర్శకత్వంలో రవితేజ సినిమా ”అమర్ అక్బర్ ఆంటోనీ” చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో రవితేజ త్రిపాత్రాభినయం చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా కోసం అను ఇమ్మాన్యుయేల్ ను ఓ హీరోయిన్ గా తీసుకోగా తనకు డేట్స్ కుదరకపోవడంతో తప్పుకుంది. మరో హీరోయిన్ గా శ్రుతిహాసన్ ను ఎంపిక చేసినట్లు తెలిసింది. అను స్థానంలో గోవా బ్యూటీ ఇలియానాను తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇదివరకు కిక్, దేవుడు చేసిన మనుషులు చిత్రాల్లో రవితేజతో నటించిన ఇల్లీ బేబీకి మూడో సినిమా అవుతుంది. దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.