HomeTelugu Newsబ్రిటిష్ ఎయిర్‌వేస్‌పై మండిపడ్డ పూజా హెగ్డే!

బ్రిటిష్ ఎయిర్‌వేస్‌పై మండిపడ్డ పూజా హెగ్డే!

బాలీవుడ్‌ ప్రముఖులు రిషీ కపూర్‌, అతుల్‌ కస్బేకర్‌, పూజా హెగ్డేలు అంతర్జాతీయ విమానసంస్థపై విరుచుకు పడ్డారు. భారతీయుల పట్ల బ్రిటీష్‌ ఎయిర్‌వేస్‌ వ్యవహరిస్తున్న తీరుపై సినీ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మనకు గౌరవమివ్వని సంస్థను ఆదరించకూడదనీ. అలాంటి వాటిని మనం కూడా దూరం పెట్టాలని రిషీ కపూర్‌ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

11 6

అతుల్‌ కస్బేకర్‌ కూడా బ్రిటీష్‌ ఎయిర్‌వేస్‌పై అసహనం వ్యక్తం చేశాడు. తనకు కూడా గతంలో ఇలాంటి అనుభవం ఎదురైందని అప్పటినుంచి ఇప్పటి వరకు ఆ సంస్థ విమానాలను ఎక్కలేదని తెలిపాడు. పూజా హెగ్డే కూడా ఓ సంఘటనను వివరిస్తూ.. “ఓ ఇండియన్‌ నీళ్లు అడిగితే ఇవ్వడం లేదు. కానీ, పక్కనున్న విదేశీయులకు మద్యం మాత్రం ఎన్నిసార్లైనా ఇచ్చారని, భారతీయులంటే వారికి చిన్నచూపని.. గ్లాస్‌ మంచి నీళ్ల కోసం 2 గంటల పాటు ఎదురుచూశానని నిన్న రాత్రే నా ఫ్రెండ్‌ నాతో చెప్పుకొచ్చాడని.. ట్వీట్‌ చేసింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu