HomeTelugu Trending'400 మంది స్ఫూర్తివంతు'ల జాబితలో నటి ప్రగతి

‘400 మంది స్ఫూర్తివంతు’ల జాబితలో నటి ప్రగతి

Actress pragathi in 400 mosనటి ప్రగతి సోషల్‌ మీడియా ద్వారా ఆనందం వ్యక్తం చేసింది. ఆమె ప్రముఖ బ్రిటన్ జర్నలిస్టు కిరణ్ రాయ్ `400 మంది స్ఫూర్తివంతుల` జాబితాలో చోటు సంపాదించడంతో ఆమె సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటికే టాలీవుడ్‌ నుండి తెలుగు బుల్లితెర ప్రముఖ యాంకర్లు ప్రదీప్ మాచిరాజు, రష్మీ గౌతమ్ ఈ అరుదైన ఘనతను సాధించారు. ఆసియాలోని భారత్, పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ దేశాల్లోని పలువురు ప్రముఖులను ఈ జాబితాలో ఎంపిక చేశారు. ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహ్మాన్ ఈ జాబితాలో ఫస్ట్‌ ప్లేస్‌లో నిలిచారు. అలాగే సోనూ నిగమ్, రహత్ ఫతే అలీ, అద్నాన్ సమీ, జాకీర్ హుస్సేన్ వంటి ప్రముఖులు ఈ జాబితాలో ఉన్నారు. ఇన్‌స్టాలో తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ప్రగతి వీడియో రిలీజ్‌ చేశారు. ఈ జాబితాలో మొత్తం 230 మంది భారతీయ ప్రముఖులు ఉన్నారు. ఇదే జాబితాలో తను కూడా ఉన్నట్లు నటి హరితేజ పేర్కొన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu