కర్నాటక ముఖ్యమంత్రి యడియూరప్పకు అక్కడి నటి సోనుగౌడ సవాల్ విసిరారు. బెంగళూరులో వాహనాలకు జరిమానాలు విధించే ముందు సరైన రోడ్లను వేయించాలని సూచించారు. జరిమానాలను విధించటం కాదు. ప్రజలు కష్టపడి సంపాదించిన డబ్బులను జరిమానాల రూపంలో వసూలు చేయటంకాదు. మొదట ప్రజలు అవసరాల కోసం సరైన రోడ్లను వేయాలని కోరారు. తన ట్విట్టర్ ఖాతాలో బైకుదారుడు ఒకరు రోడ్డుపై పడిపోతున్న ఫొటోను పోస్ట్ చేశారు. అందులో తాగినందుకు రూ.10 వేలు, సెల్ ఫోన్ వాడితే రూ. 5 వేలు జరిమానా అంటూ రాశారు. అయితే బైకుదారుడు రోడ్డుపై పడితే ప్రభుత్వానికి ఎంత జరిమానా అంటూ ప్రశ్నించారు. గతంలో మత్స్య కన్య వేషంలో ఉన్న ఫొటోను కూడా వేశారు. ఇటీవల కళాకారుడు బాదల్ నంజుండస్వామి గగనయాత్ర అంతరిక్ష ప్రయోగం చంద్రయాన్–2 ఫొటోలను కూడా జత చేశారు.
Exactly! @CMofKarnataka before asking for so much fine please make sure you give better roads..it’s hard earned money of common man please do not spoil their living.. pic.twitter.com/9Zmc8egJKu
— shruthi ramakrishna (@ssonugowda) September 6, 2019