HomeTelugu Trendingఅభిమానులకు క్షమాపణలు తెలిపిన అమితాబ్‌

అభిమానులకు క్షమాపణలు తెలిపిన అమితాబ్‌

2 18బాలీవుడ్‌ ప్రముఖ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ తన అభిమానులకు క్షమాపణలు తెలిపారు. ఆయన్ను చూసేందుకు ప్రతిఆదివారం ముంబయిలోని ఆయన నివాసం వద్దకు భారీ సంఖ్యలో అభిమానులు తరలివస్తుంటారనే విషయం తెలిసిందే. తాజాగా నిన్న భారీ సంఖ్యలో అభిమానులు ఆయన ఇంటివద్దకు చేరుకున్నారు. వర్షంపడుతున్నా సరే అభిమానులు రోడ్డుపైనిలబడి అమితాబ్‌ కోసం ఎదురు చూశారు. అయితే, కొన్నిరోజుల క్రితం అమితాబ్‌ సాధారణ చికిత్స నిమిత్తం ముంబయిలోని ఓ ప్రముఖ ఆస్పత్రికి వెళ్లి వచ్చారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు. దీంతో అమితాబ్‌ అభిమానులను కలవలేకపోయారు. తనని చూసేందుకు వచ్చిన అభిమానుల ఫొటోలను సోషల్‌మీడియా వేదికగా పోస్ట్‌ చేస్తూ.. ‘సండే మీట్‌లో భాగంగా నన్ను కలిసేందుకు ఎందరో అభిమానులు నా నివాసం వద్దకు వచ్చారు. ప్రస్తుతం నేను కోలుకుంటున్నాను. అందుకే అభిమానులను కలిసేందుకు రాలేదు. నన్ను క్షమించండి’ అని అమితాబ్‌ పేర్కొన్నారు.

ఇటీవల విడుదలై మంచి విజయాన్ని సాధించిన ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో అమితాబ్‌ నటించారు. మెగాస్టార్‌ చిరంజీవి కథానాయకుడిగా తెరకెక్కిన ఈ సినిమాలో నరసింహారెడ్డి గురువు గోసాయి వెంకన్న పాత్రలో అమితాబ్‌ మెప్పించారు. ప్రస్తుతం ఆయన ‘చెహ్రీ’, ‘గులాబో సితాబో’, ‘బ్రహ్మాస్ర్త’, ‘జుంద్‌’ సినిమాల్లో నటిస్తున్నారు. వీటితోపాటు బుల్లితెరపై ప్రసారమవుతున్న ఓ రియాల్టీ షోకు ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu