HomeTelugu Newsక్రికెట్‌ స్టేడియంలో ప్రత్యేక్షమైన అమితాబ్‌.. ఆవార్తలు నిజం కాదా?

క్రికెట్‌ స్టేడియంలో ప్రత్యేక్షమైన అమితాబ్‌.. ఆవార్తలు నిజం కాదా?

Amitabh Bachchan Responded
బాలీవుడ్‌ ప్రముఖ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన‌ట్లు వార్త‌లు వచ్చిన సంగతి తెలిసిందే. గుండెకు సంబంధించిన సమస్యతో బాధపడుతూ యాంజియోప్లాస్టీ సర్జరీ కోసం బిగ్ బి ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చేరినట్లు వార్త‌లు శుక్రవారం వైర‌ల్ అయ్యాయి.

దీంతో అమితాబ్‌ ఫ్యాన్స్‌ ఆయ‌న త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అయితే తాజాగా ఈ వార్త‌ల‌ను అమితాబ్ ఖండించారు. థానేలోని దాదోజీ కొండదేవ్ స్టేడియంలో మాఝీ ముంబయి, టైగర్స్ ఆఫ్ కోల్‌కతా మధ్య జరిగిన మ్యాచ్‌కు కుమారుడితో అమితాబ్‌ హాజరయ్యారు.

మ్యాచ్‌ చూసేందుకు వెళ్లిన ఆయన్ను ఆరోగ్యం గురించి మీడియా వారు ప్రశ్నించగా… అందులో నిజం లేదని, ఆ వార్తలు ఫేక్‌ అని తెలిపారు. దీంతో ఆయన ఫ్యాన్స్‌ ఊపిరి పీల్చుకున్నారు. అమితాబ్‌ ఐఎస్‌పీఎల్‌ ఫైనల్స్‌లో హుషారుగా పాల్గొని సందడి చేశారు. క్రికెట్‌ దిగ్గజం సచిన్‌తో కలిసి మ్యాచ్‌ను వీక్షించారు. దీనికి సంబంధించిన ఫొటోలు ఎక్స్‌లో షేర్‌ అవుతున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!