HomeTelugu Newsమనిషి మరీ క్రూరంగా మారిపోతున్నాడు: అనసూయ

మనిషి మరీ క్రూరంగా మారిపోతున్నాడు: అనసూయ

10 2

యాంకర్ అనసూయ సినిమాలతో పాటు అప్పుడప్పుడూ సమాజంలో జరిగే ఘోరాలపైనా స్పందిస్తుంటుంది. తాజాగా కేరళలో ఏనుగు ఘటనపై స్పందిస్తూ అసలు మనుషులం అనే సంగతి మరిచిపోతున్నామంటూ మండిపడింది. కనీసం మనిషి అని చెప్పుకోడానికే సిగ్గుపడే స్థాయికి దిగజారి ప్రవర్తిస్తున్నామంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న కేరళ ఏనుగు మరణం అనసూయను కూడా కదిలించింది. మామూలుగా చనిపోతే ఎవరూ అంత బాధ పడేవాళ్లు కాదు.. కానీ చంపేసారు.. నిండు గర్భంతో ఉన్న ఏనుగును పైనాపిల్‌లో పేలుడు పదార్థాలు పెట్టి తినిపించి మరీ క్రూరంగా చంపేశారు.

ఇంతటి అమానవీయ ఘటన చూసిన తర్వాత ఎవరికైనా కడుపు మండిపోతుంది. ఆ మూగజీవి పడిన బాధను తలుచుకుంటేనే కళ్ళలోంచి నీళ్లు వస్తున్నాయి. మన సమాజం ఎటు వెళ్లిపోతోంది.. కనీసం మనం మనషులం అనే సంగతి అయినా గుర్తుందా.. ప్రకృతి అంటే దేవుడు అని ఎప్పుడు తెలుసుకుంటారు.. మనిషి రోజురోజుకీ మరీ క్రూరంగా మారిపోతున్నాడనడానికి ఇదే నిదర్శనం. ఇంతకంటే దారుణం, ఘోరం మరోటి ఉండదు అన్నారు. ఓ మూగజీవిని తమ రాక్షసానందం కోసం ఇలా చంపేశారంటే ఏమనాలి అంటూ ఎమోషనల్ అయిపోయింది.

సోషల్ మీడియాలో ప్రస్తుతం అనసూయ పోస్ట్ చేసిన ఫొటో వైరల్ అవుతోంది. ఇలాంటి ఘటనలను చూస్తున్నపుడు కనీసం మనుషులమనే సంగతి కూడా మరిచిపోవాలనిపిస్తుంది.. నాకు చాలా కోపంగా ఉంది అంటూ పోస్ట్ చేసింది. అనసూయ మాత్రమే కాదు.. చాలామంది ఏనుగు మృతిపై విచారం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ విషయాన్ని కేరళ పోలీసులు కూడా చాలా సీరియస్‌గా తీసుకున్నారు. దోషులను వదిలే సమస్యే లేదని అంటున్నారు.


.

Recent Articles English

Gallery

Recent Articles Telugu