HomeTelugu Trendingకేటీఆర్‌కు అనసూయ ట్వీట్‌.. వైరల్‌

కేటీఆర్‌కు అనసూయ ట్వీట్‌.. వైరల్‌

Samanthas tweet to KTR goe

టాలీవుడ్‌ స్టార్‌ యాంకర్‌ అనసూయ భరద్వాజ్‌ సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. వ్యక్తిగత, వృత్తిగత విషయాలతో పాటు వివిధ అంశాలపై తన అభిప్రాయాన్ని తెలుపుతుందన్న విషయం తెలిసిందే. తాజాగా ఈమె స్కూల్స్‌ పునః ప్రారంభం గురించి తెలంగాణ మంత్రి కేటీఆర్‌కి చేసిన ట్వీట్‌ వైరల్‌గా మారింది.

ఆ ట్వీట్‌లో..‘డియర్‌ కేటీఆర్‌ సర్‌.. ఎందుకు లాక్‌డౌన్‌ చేశారో.. ఎందుకు తీసేశారో అర్థం చేసుకోవాలి. పెద్దవాళ్లందరూ వ్యాక్సిన్‌ వేసుకున్నారని భరోసా ఇవ్వొచ్చు.. కానీ పిల్లల పిల్లల పరిస్థితి ఏంటి సర్‌?.. స్కూల్‌లో ఉన్నప్పుడు పిల్లలకు ఏమైనా జరిగితే వారు బాధ్యులు కారని సంతకం చేసిన పేపర్‌ పంపమని పాఠశాలలు ఎందుకు బలవంతం చేస్తున్నాయి.. చెప్పండి సర్‌.. ఇది ఎంతవరకు న్యాయం.. మీరు మమ్మల్ని సరైన మార్గంలో నడిపిస్తారని ఆశిస్తున్నాను’ అంటూ రాసుకొచ్చింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu