HomeTelugu Big Storiesమహేష్‌ సినిమాలో నటించి తప్పుచేశా: బండ్ల గణేష్‌

మహేష్‌ సినిమాలో నటించి తప్పుచేశా: బండ్ల గణేష్‌

6 7నటుడు గా ఎంట్రీ ఇచ్చి నిర్మాత మారాడు బండ్ల గణేష్. ప్రొడ్యూసర్‌గా పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి బడా స్టార్ హీరోలతో సినిమాలు నిర్మించి తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. నటుడిగా బిజీగా ఉన్న బండ్ల ఉన్నట్లుండి నిర్మాత అయ్యాడు.. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చాడు. అక్కడ కాంగ్రెస్‌లో చేరడమే కాకుండా తరచూ ఎదో ఒక వ్యాఖ్యలతో వివాదల్లో నిలుస్తాడు. సెవెన్ ఓ క్లాస్ బ్లేడ్ అంటూ ఈయన చేసిన రచ్చ ఇప్పటికీ మరిచిపోలేం. ఆ తర్వాత రాజకీయాల నుంచి పూర్తిగా వైదొలిగినట్టు చెప్పి సంచలనం క్రియేట్ చేసాడు. నటుడిగా గ్యాప్ తీసుకున్న ఈయన చాలా రోజుల తర్వాత ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాడు. తాజాగా ఈయన ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూ ఇచ్చాడు దీనిలో భాగంగా ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. దానికి సంబంధించిన ప్రోమో రిలీజైంది.

ఈ ప్రోమోలో బండ్ల గణేష్.. జగన్ పాలన, పవన్ కళ్యాణ్‌తో పాటు కరోనా వచ్చినపుడు చిరంజీవి తనకు ఫోన్ చేసిన విషయాలను ప్రస్తావించారు. రీ ఎంట్రీలో సరిలేరు నీకెవ్వరు సినిమా చేసి పెద్ద తప్పు చేసానంటూ చెప్పుకొచ్చాడు. ఆ పాత్ర నాకు ఎలాంటి గుర్తింపు తీసుకురాలేదు. నాకు తెలిసిన వాళ్లందరు ఈ పాత్ర ఎందుకు చేశావు అంటూ తనను తిట్టి పోసినట్టు చెప్పుకొచ్చాడు. ఇకపై ప్రాధాన్యత లేని వేషాలు వేయనని చెప్పుకొచ్చాడు. అంతేకాదు ఇకపై యాక్టింగ్ చేయదలుచుకోలేదు అంటూ సంచనల వ్యాఖ్యలు చేయడం తీవ్ర దుమారం రేపుతున్నాయి. మొత్తంగా ప్రోమోతోనే పెద్ద దుమారం రేపిన బండ్ల గణేష్ ఇంటర్వ్యూ తర్వాత ఎలాంటి సంచలనం సృష్టిస్తాడో చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu