HomeTelugu Trendingలైంగిక వేధింపుల కేసులో బాలీవుడ్‌ దర్శకుడికి సమన్లు..

లైంగిక వేధింపుల కేసులో బాలీవుడ్‌ దర్శకుడికి సమన్లు..

Bollywood director summoned
బాలీవుడ్‌ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌కు ముంబైలోని వెర్సోవా పోలీసులు బుధవారం సమన్లు పంపిచారు. అనురాగ్‌ కశ్యప్‌ తనను లైంగికంగా వేధించారని నటి పాయల్‌ ఘోష్‌ ఆరోపించిన విషయం తెలిసిందే. మహిళలపై లైంగిక వేధింపులకు సంబంధించి మీటూ ఉద్యమం తరువాత దర్శకుడు అనురాగ్ కశ్యప్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. అయితే తనకు న్యాయం చేయాలంటూ పాయల్‌ ప్రధాని నరేంద్ర మోడీని కోరిన విషయం తెలిసిందే. పాయల్‌ ఘోష్‌ ఫిర్యాదు మేరకు ముంబైలోని వెర్సోవా పోలీస్ స్టేష‌న్‌లో పోలీసులు అనురాగ్‌పై కేసు నమోదు చేశారు. ఇందులో భాగంగా రేపు(గురువారం) ఉదయం 11 గంటలకు పోలీసు స్టేషన్‌లో అనురాగ్‌ కశ్యప్‌ హాజరు కావాలని సమన్లలో పోలీసులు పేర్కొన్నారు. 2013లో వెర్సోవాలోని యారి రోడ్డులో కశ్యప్‌ త‌న‌పై అత్యాచారం చేశారని ఇటీవల న‌టి పాయ‌ల్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏడేళ్ల క్రితం జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌పై విచార‌ణలో భాగంగా అనురాగ్ కశ్యప్‌ను పోలీసులు విచారణ జరపనున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu