HomeTelugu Trendingబాలీవుడ్‌ చిత్రం కోసం రెండురోజులు ఆ బ్రిడ్జ్ ను మూసేశారట!

బాలీవుడ్‌ చిత్రం కోసం రెండురోజులు ఆ బ్రిడ్జ్ ను మూసేశారట!

2 29

హాలీవుడ్‌ నటుడు హృతిక్‌ రోషన్‌, టైగర్‌ ష్రాఫ్‌లు నటిస్తున్న యాక్షన్ మూవీ ‘వార్’. యాక్షన్ ప్రధానాంశంగా తెరకెక్కిన ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలను 7 దేశాల్లో చిత్రీకరించారు. అందులో ఒకటి ఫోర్చుగల్. ఆ దేశంలోని పోర్టో నగరం మధ్యలో నదిపై ఓ బ్రిడ్జి ఉన్నది. ఎత్తైన ఆ వంతెనపై వార్ ఫైట్ ను షూట్ చేశారు.

రెండు రోజులపాటు షూటింగ్ చేయాల్సి రావడంతో ఆ రెండు రోజులు బ్రిడ్జిపై రాకపోకలను నిలిపివేయాలని స్థానిక అధికారులను యూనిట్ కోరింది. స్థానిక అధికారుల సహాయంతో బ్రిడ్జిపై రెండు రోజులపాటు హృతిక్, టైగర్ ష్రాఫ్ లపై ఫైట్ సీన్ ను షూట్ చేశారు. బ్రిడ్జిపై చిత్రీకరించిన సీన్స్ అద్భుతంగా వచ్చాయని, ఈ ఫైట్ సీన్ సినిమాకు హైలైట్ అవుతుందని అంటున్నారు. వార్ సినిమా అక్టోబర్ 2 వ తేదీన విడుదల కాబోతున్నది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu