HomeTelugu Trendingఓటీటీలో మెప్పిస్తునన కార్తికేయ 'చావు కబురు చల్లగా'

ఓటీటీలో మెప్పిస్తునన కార్తికేయ ‘చావు కబురు చల్లగా’

  1. Chaavu Kaburu Challaga movi
    టాలీవుడ్‌ యువనటుడు కార్తికేయ, లావణ్య త్రిపాఠి హీరోహీరోయిన్‌లుగా నటించిన చిత్రం ‘చావు కబురు చల్లగా’. మార్చి 19న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఎంటర్‌టైనర్‌గా మెప్పించినా, అంచనాలను మాత్రం అందుకోలేకపోయింది. కాగా, డిజిటల్‌ మాధ్యమంలో మాత్రం విశేషంగా మెప్పిస్తోంది. ప్రముఖ ఓటీటీ ‘ఆహా’ వేదికగా ఏప్రిల్‌ 23న ప్రేక్షకుల ముందుకు వచ్చి అందరినీ ఆకట్టుకుంటోంది. విడుదలైన 72 గంటల్లో 100 మిలియన్‌ వ్యూయింగ్‌ మినిట్స్‌ సొంతం చేసుకుందని ‘ఆహా’ తెలిపింది. ఈ చిత్రానికి కౌశిక్‌ పెగళ్లపాటి దర్శకత్వం వహించారు. గీతా ఆర్ట్స్‌ 2 పతాకంపై బన్నివాసు నిర్మించారు. జేక్స్‌ బెజోయ్‌ సంగీతం అందించారు. ఓటీటీ కోసం ఈ చిత్రాన్ని రీ ఎడిట్‌ చేసి, నిడివి తగ్గించిన విషయం తెలిసిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu