కరోనా ఎఫెక్ట్తో సెలబ్రెటీల దగ్గరనుంచి సామాన్యుల వరకు అందరు ఇళ్లకే పరిమితమైపోయారు. ఎప్పుడు బిజీ బిజీగా గడిపే వారికీ లాక్ డౌన్ నేపద్యంలో ఫ్యామిలీతో కలిసి సంతోషంగా గడిపే సమయం దొరికింది. ఇక సెలబ్రెటీలు సైతం తమ కుటుంబసభ్యులతో గడుపుతున్నారు. ఇదిలా ఉంటె కొంతమంది లాక్ డౌన్ కారణంగా తమకు కావాల్సిన
వారికీ దూరంగా కూడా ఉంటున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా లాక్డౌన్ కారణంగా తన సొంతవారిని మిస్ అవుతున్నాను అని తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి తన కుటుంబానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో అందరికి తెలిసిందే.
ప్రతి ఏడాది సంక్రాంతికి.. చిరు కుటుంబ సభ్యులంతా ఒకచోట చేరి పండగ జరుపుకుంటారు. అలాగే వీలు దొరికినప్పుడల్లా.. ఆదివారం రోజున మెగా ఫ్యామిలీ అందరు కలిసుకునేలా ప్లాన్ చేసుకుంటారు. అయితే ప్రస్తుతం కరోనా కట్టడిలో భాగంగా లాక్డౌన్ విధించడంతో చాలా మంది వారివారి ఇళ్లకే పరిమితమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చిరంజీవి తన కుటుంబ సభ్యులను గుర్తు చేసుకుంటూ ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్ట్ చేశారు. ఒక ఆదివారం దగ్గరైన వారిని కలవడం మిస్ అవుతున్న మీకు కూడా ఇలాంటి ఫీలింగ్ ఉందా నేను అమ్మ, తమ్ముడు, చెల్లెలు.. అంటూ క్యాప్షన్ పెట్టి తన కుటుంబ సభ్యుల ఫోటోలు చిరంజీవి షేర్ చేసారు చిరంజీవి.
On a Sunday before lockdown. Missing meeting the dear ones. I am sure most of you share this feeling too. Hope those times will return for all of us..soon!
ఓ ఆదివారం – అమ్మ దగ్గర
నేను- చెల్లెల్లు తమ్ముళ్లు#StayHomeStaySafe pic.twitter.com/43tiOwQOLD
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 19, 2020