తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటర్లు మాస్కులు ధరించి.. కరోనా రూల్స్ పాటిస్తూ ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. తెలంగాణ మంత్రి కేటీఆర్, శైలిమ దంపతులు జారాహిల్స్లోని నందినగర్ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. కేంద్రమంత్రి కిషన్రెడ్డి దంపతులు కాచిగూడలోని దీక్షా మోడల్ స్కూల్ పోలింగ్ కేంద్రంలో, జూబ్లీ హిల్స్లోని జూబ్లీక్లబ్ పోలింగ్ కేంద్రంలో మెగాస్టార్ చిరంజీవి దంపతులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఫిల్మ్నగర్ క్లబ్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ, నిర్మాత శ్యాంప్రసాద్రెడ్డి, చిక్కడపల్లిలోని పోలింగ్ కేంద్రంలో బీజేపీ నేత లక్ష్మణ్, నాంపల్లిలోని వ్యాయామశాఖ పోలింగ్ కేంద్రంలో సైబరాబాద్ సీపీ సజ్జనార్, శాస్త్రిపురంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, బోరబండలోని సైట్వన్ పోలింగ్ కేంద్రంలో ఉపమేయర్ బాబా ఫసియుద్దీన్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.