HomeTelugu Trendingచిరంజీవి 'పునాదిరాళ్లు' డైరెక్టర్‌ మృతి

చిరంజీవి ‘పునాదిరాళ్లు’ డైరెక్టర్‌ మృతి

2 16
మెగాస్టార్‌ చిరంజీవి దర్శకుడు స్టార్‌ డైరెక్టర్‌ గుడిపాటి రాజ్‌కుమార్‌ కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. చిరంజీవి తొలి చిత్రం పునాదిరాళ్లు సినిమాకు ఆయన దర్శకత్వం వహించారు. దర్శకుడిగా ఆయనకు కూడా పునాదిరాళ్లు మొదటి సినిమా. మొదటి సినిమాకే ఐదు నంది అవార్డులు దక్కించుకొని గుర్తింపు పొందారు.

రాజ్‌కుమార్‌ అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న చిరంజీవి ..ఇటీవల ఆయనకు అపోలో ఆసుపత్రిలో వైద్యం చేయించారు. కొన్ని రోజుల క్రితమే రాజ్‌కుమార్‌ పెద్ద కుమారుడు చనిపోయారు. ఆతర్వాత భార్య కూడా మృతి చెందడంతో రాజ్‌కుమార్‌ మరింత కుంగిపోయారు. రాజ్‌కుమార్‌ స్వస్థలం కృష్ణా జిల్లా ఉయ్యూరు. ఆయన భౌతికకాయాన్ని ఉయ్యూరు తరలించేందుకు చిన్న కుమారుడు ఏర్పాట్లు చేస్తున్నారు

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!