HomeTelugu Newsఎన్నికల ఫలితాలపై కమెడియన్ ధన్‌రాజ్ ఆసక్తికర పోస్ట్‌

ఎన్నికల ఫలితాలపై కమెడియన్ ధన్‌రాజ్ ఆసక్తికర పోస్ట్‌

7 13
ఏపీ ఎన్నికల ఫలితాల విడుదలకు ముందు జబర్దస్త్ హాస్య నటుడు ధన్‌రాజ్ సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్ చేశారు. ఎన్నికల ఫలితాలపై జనసేన పార్టీకి మద్దతుగా ధన్‌రాజ్ ఓ పోస్ట్ చేశారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. 23న తుఫానుగా మారి, శ్రీకాకుళం, తూర్పు, పశ్చిమగోదావరి మీదుగా కుప్పంలో తీరం దాటనుంది. గంటకు 120-145 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీస్తాయి. ఆ గాల్లో ఎవడైనా ఎగిరిపోతే మాకు ఏ సంబంధం లేదు. ప్రమాద హెచ్చరిక ముందుగానే జారీ చేశాం. తుఫానుకి “జనసేన శతఘ్ని” అని నామకరణం చేశాం అని ధన్‌రాజ్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు.

మే 23న ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నందున జనసేన ప్రభంజనం ఖాయమని.. పవన్ కళ్యాణ్ దెబ్బకు చంద్రబాబు ప్రభుత్వం ఓటమి ఖాయమని అర్థం వచ్చేలా ధన్‌రాజ్ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ కాసేపట్లోనే వైరల్‌గా మారింది. ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ మధ్యే ప్రధాన పోటీ సాగిందని.. జనసేన ప్రభావం అంతగా లేదని అంచనాలు వెలువడ్డాయి. కానీ జనసేనకు సైలెంట్ ఓటింగ్ పడిందని, అంచనాలకు అందని రీతిలో తమ పార్టీ ప్రభావం చూపుతుందని పవన్ ఫ్యాన్స్ నమ్ముతున్నారు. ఇలాంటి తరుణంలో ఎన్నికల ఫలితాల వెల్లడికి కొద్ది రోజుల మందు పవన్ కళ్యాణ్ పార్టీ గురించి ధన్‌‌రాజ్ చేసిన పోస్ట్ ఆసక్తికరంగా మారింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu