HomeTelugu Newsతెలంగాణలో క్రమంగా పెరుగుతున్న కరోనా కేసులు

తెలంగాణలో క్రమంగా పెరుగుతున్న కరోనా కేసులు

11 9
తెలంగాణలోనూ కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతూ ఉన్నాయి. ఇవాళ మరో 51 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. గత 3 రోజులుగా ఎక్కువ కేసులు బయటపడుతుండటం అధికారుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఇవాళ నమోదైన కేసుల్లో 37 హైదరాబాద్‌ పరిధిలోనివే. మరో 14 కేసులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారుగా తేలింది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 1326కి చేరింది. ఇవాళ కరోనాతో ఇద్దరు మృతిచెందడంతో కరోనా సోకి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 32కి చేరింది. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకుని 822 మంది డిశ్చార్జి కాగా మరో 472 మంది చికిత్సపొందుతున్నారు. ఇవాళ 21 మంది డిశ్చార్జి అయ్యారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu