HomeTelugu Trendingకరోనా నాకు పాఠం నేర్పింది: జాన్వీ కపూర్‌

కరోనా నాకు పాఠం నేర్పింది: జాన్వీ కపూర్‌

5 3
కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా విలయతాండవం చేస్తోంది. ఈ వైరస్‌ కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కోనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ తాను చాలా నేర్చుకున్నానంటోంది. తాను తెలుసుకున్న విషయాల గురించి జాన్వీ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. లాక్‌డౌన్ కారణంగా తాను చాలా విషయాలు తెలుసుకున్నట్లు వెల్లడించింది. రోజూ మనం తింటున్న ఆహారం విలువ ఏమిటో తెలిసొచ్చింది అంటోంది. దేశంలో ఎంతోమంది తినడానికి తిండి లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇన్ని రోజులూ ఇలాంటి వారి గురించి ఆలోచించని నేను ఎంత స్వార్థపరురాలినో అని అర్థమైంది. నా జీవితం రోజూ సాఫీగా సాగడానికి ఎంతమంది కష్టపడుతున్నారో తెలిసింది. మా ఇంటికి నేనెంతో అవసరమని, అలాగే నేను ఎంత బాధ్యతగా ఉండాలో కూడా అర్థమైంది అంటూ జాన్వీ ట్వీట్ చేసింది. మొత్తం మీద కరోనా వైరస్ జాన్వీకి పాఠం నేర్పిందంటోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!