HomeTelugu Trendingఅమీషా పటేల్ పై నోటీసులు జారీ.. అరెస్ట్ వారెంట్

అమీషా పటేల్ పై నోటీసులు జారీ.. అరెస్ట్ వారెంట్

1పవర్‌ స్టార్‌ పవన్ కళ్యాణ్ బద్రి సినిమా లో రేణు దేశాయ్ తో పాటు అమీషా పటేల్ కూడా హీరోయిన్ గా చేసింది. ఆ సినిమా హిట్ కొట్టడంతో.. ఈ అమ్మడు తరువాత అనేక సినిమాల్లో నటించింది. బద్రి మినహా మరో సినిమా హిట్ కాలేదు. అటు బాలీవుడ్ లో మంచి ఆఫర్లు తెచ్చుకొని కెరీర్ చక్కగా సాగుతున్న సమయంలో నిర్మాతగా మారి సినిమా తీయాలని అనుకుంది.

దేశీ మ్యూజిక్ పేరుతో సినిమా మొదలు పెట్టింది. 2013 లో మొదలైన ఈ మూవీపై ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు. సినిమా ఏమైందో తెలియదు. ఈ సినిమా కోసం ఫైనాన్షియర్ అజయ్ కుమార్ సింగ్ నుంచి మూడు కోట్ల రూపాయల ఋణం తీసుకుంది. ఆ రుణాన్ని తిరిగి ఇవ్వకపోవడంతో అజయ్ కుమార్ సింగ్ కోర్టును ఆశ్రయించారు. పైగా చెక్కు అమీషా పటేల్ ఇచ్చిన చెక్ కూడా బౌన్స్ కావడంతో కేసును దాఖలు చేశారు. కోర్టు అమీషా పటేల్ కు నోటీసులు జారీ చేసింది. జులై 8 వ తేదీన ఆమె తప్పకుండా కోర్టుకు హాజరు కావాలి. అలా హాజరుకాని పక్షంలో ఆమెకు అరెస్ట్ వారెంట్ జారీ అయ్యే అవకాశం ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu